బీజేపీ ప్రచారంలో అపశ్రుతి.. ప్రచార రథంలోనే కుప్పకూలిపోయిన బీజేపీ నేత బండి సంజయ్!

బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పట్టణంలో పర్యటిస్తుండగా ఒక్కసారిగా ప్రచార వాహనంలోనే సంజయ్ కుప్పకూలిపోయారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను హుటాహుటిన అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సంజయ్ కు వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. సంజయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారని వ్యాఖ్యానించారు. కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. సంజయ్ కు ఏమీ కాకపోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి సంజయ్ పోటీ చేస్తున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం తుది గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Telangana
Karimnagar District
loksabaha
BJP
bandi
sanjay
sun stroke

More Telugu News