modi: మోదీకే కాదు... ఆయన డాడీకి కూడా భయపడను: దినకరన్

  • రాష్ట్ర హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించివేసింది
  • మోదీకి పళనిస్వామి ప్రభుత్వం బానిసలా వ్యవహరిస్తోంది
  • బీజేపీని తరిమికొట్టడమే నా ధ్యేయం

తమిళనాడు రాష్ట్ర హక్కులన్నింటినీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హరించివేసిందని అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ విమర్శించారు. రాష్ట్రంలోని పళనిస్వామి ప్రభుత్వం మోదీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీని తరిమి కొట్టడమే తమ ధ్యేయమని అన్నారు. మోదీనే కాదు... ఆయన డాడీ వచ్చినా భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో తమ పార్టీ అభ్యర్థి భువనేశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని దినకరన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News