Chandrababu: చంద్రబాబు మీద నా దగ్గరో పుస్తకం ఉంది, అది బయటకొస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి: మోహన్ బాబు

  • కేసీఆర్ కాళ్లు కడిగేది చంద్రబాబే
  • చంద్రబాబు మూర్ఖుడు
  • అతని స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి?

ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఒక దశలో తాను చంద్రబాబును బాగా నమ్మానని, అందుకు ప్రతిఫలంగా తనపై చెప్పులు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కులాల నడుమ చిచ్చు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లకు కులపిచ్చి అంటించింది చంద్రబాబేనని మండిపడ్డారు.

చంద్రబాబు మీద తన వద్ద ఓ పుస్తకం ఉందని, అది బయటికొస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. అయినా తన స్థాయికి చంద్రబాబు తగినవాడు కాదని, ఓటుకు నోటు కేసులో భయపడి హైదరాబాద్ వదిలి పారిపోయాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అందరిపై విమర్శలు చేసే చంద్రబాబే తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటాడని అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News