YSRCP: లక్ష్మీపార్వతి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు: జీవితా రాజశేఖర్ ఆగ్రహం

  • కంప్లయింట్ ఇచ్చిన వాడి వయసేంటి?
  • ఎన్నికలకు ముందే మాట్లాడాల్సిన అవసరమేంటి?
  • ఫిర్యాదు నిరూపితమే కాలేదు ఛానెల్స్ లో చూపిస్తారా?

వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిపై కోటి అనే వ్యక్తి నిన్న తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను వైసీపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ ఖండించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘లక్ష్మీపార్వతి గారి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు. కంప్లయింట్ ఇచ్చిన వాడి వయసేంటి? ఈ వెధవ ఎన్నికలకు ముందే మాట్లాడాల్సిన అవసరమేంటి? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నప్పుడు తెలియలేదా?’ అని ప్రశ్నించారు.

 లక్ష్మీపార్వతిపై ఆరోపణల గురించి టీవీ ఛానెల్స్ లో చూపిస్తున్న వాళ్లకు అమ్మలు, అక్కాచెల్లెళ్లు లేరా? చేసిన ఫిర్యాదు నిరూపితమైందా? ఈ లోపే, అతన్ని తీసుకొచ్చి ఛానెల్స్ ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తారా? ఏ ఛానెల్స్ వాళ్లు అయితే అతనితో మాట్లాడిస్తున్నారో, వాళ్లు కూడా ఓ అమ్మకు పుట్టినవాళ్లేగా అని నిప్పులు చెరిగారు. ఇలాంటి ఛానెల్స్ మీడియా పరువును తీస్తున్నాయని, ఇలాంటి సంపాదన కావాలా? అని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వాళ్లను మీడియా వాళ్లే వెలివేయాలని జీవితా రాజశేఖర్ సూచించారు.

More Telugu News