Chittor: టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు

  • ఘర్షణలో ఒక బైక్ ధ్వంసం
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
  • భద్రత కట్టుదిట్టం

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. తాజాగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం పీబీవాడలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన ఐదుగురు కార్యకర్తలకు గాయాలవగా, ఒక బైక్ ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇకపై ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Telugu News