Andhra Pradesh: ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై చర్యలు తీసుకోండి.. పోలీస్ కమిషనర్ కు వైసీపీ నేతల ఫిర్యాదు!

  • రాధాకృష్ణ బోగస్ సర్వేను ప్రచురించారు
  • ఆయనపై చీటింగ్, ఫోర్జరీ కేసు పెట్టండి
  • వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, నాగిరెడ్డి డిమాండ్

ఆంధ్రజ్యోతి పత్రికలో ఇటీవల ప్రచురితమైన ఓ సర్వేపై వైసీపీ నేతలు నాగిరెడ్డి, గౌతంరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉద్దేశపూర్వకంగా బోగస్ సర్వే ప్రచురించిన ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బోగస్ సర్వేను ప్రచురించినందుకు రాధాకృష్ణపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టాలన్నారు.

More Telugu News