TTD: ఏప్రిల్ నెలలో మిగిలిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు... లాటరీ ద్వారా పంచుతామన్న టీటీడీ!

  • 415 టికెట్లు ఉన్నాయన్న టీటీడీ
  • విజయా బ్యాంక్ ద్వారా ముందురోజు కేటాయింపు
  • నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఏప్రిల్‌ నెలకు సంబంధించిన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవా టికెట్లు 415 మిగిలాయని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లను భక్తులకు లాటరీ విధానంలో పంచుతామని అధికారులు తెలిపారు. సేవ జరిగే ముందు రోజు విజయా బ్యాంకులో పేరు నమోదు చేసుకుని, ఆ రోజు సాయంత్రం లక్కీ డిప్ లో పేరు వస్తే, వెంటనే డబ్బు కట్టి పొందవచ్చని అన్నారు. కాగా, త్వరలో ఉగాది పర్వదినం రానున్న తరుణంలో నేడు స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతోంది. ఈ కారణంతో మధ్యాహ్నం వరకూ భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. బ్రేక్‌ దర్శనాన్ని  ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.

More Telugu News