Cricket: ఐపీఎల్ సందడి: డికాక్ దూకుడు... ముంబయి భారీ స్కోరు

  • రాణించిన రోహిత్ శర్మ
  • హార్దిక్ పాండ్య మెరుపులు
  • పంజాబ్ టార్గెట్ 177

ఐపీఎల్ తాజా సీజన్ లో క్రమంగా జోరు పెరుగుతోంది. తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగినా ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లు క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందిస్తున్నాయి. తాజాగా, మొహాలీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోరులో ముంబయి జట్టు భారీ స్కోరు నమోదు చేసింది.

 మొదట్లో క్వింటన్ డికాక్, చివర్లో హార్దిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ల సాయంతో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్ 39 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 6 ఫోర్లు, 2 సిక్స్ లతో అలరించాడు. రోహిత్ శర్మ 18 బంతుల్లో 32 పరుగులు సాధించగా, ఆఖర్లో హార్దిక్ పాండ్య 19 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 31 పరుగులు చేశాడు. మధ్యలో వికెట్లు కోల్పోవడంతో యువరాజ్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. యువీ 22 బంతులాడి 18 పరుగులు సాధించాడు.

More Telugu News