Mohanbabu: మోహన్ బాబు ఎంత దురుసో పరిశ్రమ మొత్తానికి తెలుసు: దాసరి పెద్ద కోడలు సుశీల ఘాటు విమర్శలు

  • ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు?
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?
  • జీవితంలో ఎవరినీ ఆదుకోలేదన్న దాసరి సుశీల

నటుడు మోహన్ బాబు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారో చెప్పాలని దివంగత దాసరి నారాయణరావు పెద్ద కోడలు సుశీల ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, 'పసుపు కుంకుమ' పథకంపై ఆయన చేసిన విమర్శలను తప్పుబట్టారు. మోహన్ బాబుది దురుసు ప్రవర్తనని ఆరోపించిన ఆమె, ఈ విషయం సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ఆయన తన జీవితంలో ఏ మహిళకైనా 'పసుపు కుంకుమ' ఇవ్వలేదని ఆరోపించారు. లక్షల మందికి చంద్రబాబునాయుడు అండగా నిలిచి, ఈ పథకాన్ని అందించారని, అందులో తప్పేముందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించిన సుశీల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మోహన్ బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.

More Telugu News