jagan: జగన్ సభలో అపశ్రుతి.. గోడ కూలి 20 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం.. వీడియో చూడండి

  • తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జగన్ ప్రచారం
  • కుప్పకూలిన పిట్టగోడ
  • గాయపడినవారిలో మీడియా సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఈరోజు వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు సభకు హాజరయ్యారు. రోడ్డు కిక్కిరిసి పోవడంతో పాటు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపై భారీ సంఖ్యలో అభిమానులు నిలబడ్డారు. అయితే, ఊహించని విధంగా ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. పక్కనే ఉన్న ఓ భవనం పిట్టగోడ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి గాయాలైనట్టు సమాచారం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  గాయపడిన వారిలో మీడియా సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News