krish: బాలీవుడ్ ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో క్రిష్

  • 'అంతరిక్షం' తెచ్చిన నష్టాలు
  • ఎన్టీఆర్ బయోపిక్ తో విమర్శలు
  •  హిందీ సినిమా తరువాతనే తెలుగు మూవీ

తెలుగు దర్శకులలో క్రిష్ స్థానం ప్రత్యేకమైనదనే చెప్పాలి. తెరపై మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఆయన మంచిపేరును సంపాదించుకున్నారు. అలాంటి క్రిష్ కి .. దర్శకుడిగా - నిర్మాతగా ఈ మధ్యకాలంలో గట్టి దెబ్బలే తగిలాయి. ఆయన నిర్మించిన 'అంతరిక్షం' నష్టాలను తెచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ వీలైనన్ని విమర్శలను ఆయన చేతిలో పెట్టింది.

ఇక 'మణికర్ణిక' సినిమా విషయంలో కంగనతో వివాదం కూడా ఆయనకే మైనస్ మార్కులు పడేలా చేసింది. ఈ నేపథ్యంలో క్రిష్ తదుపరి సినిమా ఎప్పుడు? .. ఎవరితో? అనే ఆసక్తితో అంతా ఎదురుచూస్తున్నారు. ఒక బాలీవుడ్ ప్రాజెక్టును ఆయన సెట్ చేసుకునే పనిలో ఉన్నాడనీ .. త్వరలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనే వార్త వినిపిస్తోంది. ఆ తరువాత బన్నీతో తెలుగులో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి క్రిష్ మళ్లీ నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడన్న మాట. 

More Telugu News