Tejaswi Surya: అనూహ్య ఎంపిక... బెంగళూరు సౌత్ నుంచి యువనేతను బరిలోకి దింపిన బీజేపీ!

  • తేజస్వీ సూర్య పేరు ప్రకటన
  • యువ న్యాయవాదిగా ఉన్న తేజస్వీ
  • నమ్మలేకున్నానని వ్యాఖ్య

బెంగళూరుకు చెందిన యువ న్యాయవాది, బీజేపీలో ఎదుగుతున్న నేతగా ఉన్న తేజస్వీ సూర్యను బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు బీజేపీ తెలిపింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ పడనున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై మోదీ వారణాసికే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో అనూహ్యంగా తేజస్వీ సూర్యకు అవకాశం లభించింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య, "ఓ మై గాడ్. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని, అతిపెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఓ 28 ఏళ్ల యువకుడిపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు సౌత్ సీటు ఇచ్చారు. ఇది కేవలం బీజేపీలో మాత్రమే జరుగుతుంది. నరేంద్ర మోదీ నవీన భారతావనిలోనే ఇది సాధ్యం" అని ట్వీట్ చేశారు. బెంగళూరు సౌత్ నుంచి ఎంపీగా ఉన్న అనంతకుమార్, గత సంవత్సరం మరణించిన సంగతి తెలిసింది. 1999లో కాంగ్రెస్ నేత బీకే హరి ప్రసాద్ ను ఓడించి, ఎంపీగా ఎన్నికైన అనంతకుమార్, అప్పటి నుంచి ఓటమిని ఎదుర్కోలేదు.

More Telugu News