gorantla madhav: గోరంట్ల మాధవ్ నామినేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ!

  • స్టే విధించాలని కోరిన ఏపీ ప్రభుత్వం
  • అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
  • సజావుగా సాగిన నామినేషన్ ప్రక్రియ    

హిందూపురం లోక్ సభ నియోజక వర్గం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్ పై సస్పెన్స్ నెలకొన్న విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో, ఆయన నామినేషన్ విషయంపై పలు సందేహాలు తలెత్తాయి. ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ నేపథ్యంలో మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదించాలని ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.

ట్రైబ్యునల్ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం స్టే కోరుతూ వేసిన పిటీషన్ ను నిరాకరిస్తూ .. ఆయన నామినేషన్ వేసుకోవచ్చంటూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సకాలంలో హైకోర్టు తీర్పు రావడంతో గోరంట్ల మాధవ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దాంతో అప్పటివరకూ కొనసాగిన సస్పెన్స్ కి తెరపడింది.   

More Telugu News