వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన భార్య సౌభాగ్యమ్మ!
- మాకు ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదు
- మూడో పార్టీ లేదా సీబీఐతో విచారణ జరిపించండి
- ఈరోజు మధ్యాహ్నం పిటిషన్ ను విచారించనున్న హైకోర్టు
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.