Guntur District: ఆ పార్టీలన్నింటికీ చంద్రబాబే ఫైనాన్స్ చేస్తున్నారు: జగన్ ఆరోపణ

  • కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి
  • ఆ పార్టీ కండువాలు మా కండువాలనే పోలి ఉన్నాయి
  • చంద్రబాబుకు పార్టనర్ గా ఒక యాక్టర్ ఉన్నాడు!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని, ఆ పార్టీలన్నింటికీ చంద్రబాబే ఫైనాన్స్ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఆ పార్టీ వాళ్లు వేసుకునే కండువాలు తమ పార్టీ కండువాలనే పోలి ఉన్నాయని విమర్శించారు. చిలకలూరి పేట వైసీపీ అభ్యర్థిని విడదల రజనీని గెలిపించాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమెను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. చంద్రబాబుకు పార్టనర్ గా ఒక యాక్టర్ ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ఏది చెబితే అదే ఆ యాక్టర్ చేస్తాడని, ఆయన చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తాడని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే వారికి డిపాజిట్లు కూడా రావని ఆ యాక్టర్ కు తెలుసని వ్యాఖ్యానించారు.

More Telugu News