Sakshi: 'సాక్షి'పై టీడీపీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్ ఫిర్యాదు!

  • పరువు నష్టం కలిగే కథనాలు ప్రసారం చేస్తున్నారు
  • చానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోండి
  • పోలీసులకు, ఈసీకి బద్వేలు అభ్యర్థి ఫిర్యాదు

తనకు పరువునష్టం కలిగేలా జగన్ చానల్ 'సాక్షి'లో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కడప జిల్లా బద్వేలు టీడీపీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్, పోలీసులకు, ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ చానల్ కథనాలతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని, వ్యక్తిగత నష్టం వాటిల్లిందని అన్నారు. తాను పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నానని, టికెట్ కోసం రూ. 3 కోట్లు ఇచ్చిన తాను, ఇప్పుడు దాన్ని తిరిగి ఇవ్వాలని అడుగుతున్నానంటూ తప్పుడు వార్తలు ఇచ్చారని డాక్టర్ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. కార్యకర్తల్లో అలజడి సృష్టించి, ఓట్లకు గండికొట్టేందుకు ఈ పని చేస్తున్నారని, తప్పుడు ప్రసారాలు చేసిన చానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

More Telugu News