కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైఎస్ సునీత

  • వివేకా హత్య కేసు విషయమై ‘హోం’ను కలిసిన సునీత
  • ఈ కేసు వ్యవహారం ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఉంది
  • కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని సూచన
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ లేదా మరేదైనా సంస్థతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ను వైఎస్ సునీతారెడ్డి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర హోం శాఖను కలవాలన్న సీఈసీ సూచనల మేరకు ఆమె ఆ శాఖ కార్యదర్శిని కొద్ది సేపటి క్రితం కలిశారు. అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ కేసు విషయమై ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు కనుక, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి తనకు సూచించినట్టు ఆమె చెప్పారు.
Go Back to Shorts
New delhi
CEC
Home ministry
Ys viveka
suntha
Andhra Pradesh
High Court
cbi

More Telugu News