chiranjeevi: 'సైరా' కోసం చైనా వెళుతోన్న చిరంజీవి

  • ముగింపు దశలో 'సైరా' షూటింగు 
  • తదుపరి షెడ్యూల్ చైనాలో 
  • ఆగస్టు 15న రిలీజ్ చేసే ఛాన్స్  

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా రూపొందుతోంది. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, మరో రెండు నెలల్లో షూటింగు పార్టును పూర్తి చేసుకోనుంది. ఆ దిశగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి.

ఈ సినిమా కోసం మరో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయవలసి ఉందట. ఈ భారీ పోరాట సన్నివేశాలను చైనాలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి .. తదితరులపై దాదాపు 20 రోజుల పాటు పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. వచ్చే నెలలో అక్కడ ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. అమితాబ్ .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News