nithin: ఫేక్ న్యూస్ నమ్మకండి .. షాక్ ఇచ్చిన నితిన్

  • నితిన్ తాజా చిత్రంగా 'భీష్మ'
  • తదుపరి సినిమా చంద్రశేఖర్ యేలేటితో
  • ఏప్రిల్లో సెట్స్ పైకి      

నితిన్ తన తాజా చిత్రంగా 'భీష్మ'ను పట్టాలెక్కించనున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో రమేశ్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడనీ .. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే ప్రకటన ఒకటి నిన్న వచ్చింది. ఆ తరువాత కొంతసేపటికి తాను చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాననీ, ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని నితిన్ ట్వీట్ చేశాడు.

అయితే ఆయన రమేశ్ వర్మతో సినిమాను గురించి ప్రస్తావించకపోవడం అభిమానులను అయోమయానికి గురిచేసింది. తాజాగా ఈ విషయంపై నితిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "నేను చేయబోయే సినిమాలకి సంబంధించిన విషయాలను నా సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ చేస్తుంటాను .. ఫేక్ న్యూస్ ను నమ్మకండి" అని స్పష్టం చేశాడు. దాంతో నితిన్ ఓకే  చెప్పకముందే రమేశ్ వర్మ అత్యుత్సాహం చూపించాడని చెప్పుకుంటున్నారు. 

More Telugu News