చిత్తూరులో మారనున్న రాజకీయం.. సైకిల్ ఎక్కనున్న సీకే బాబు

  • నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబు
  • జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు
  • ఆయనతో పాటే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న పలువురు నేతలు
మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. చిత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో బలమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. సీకేబాబు టీడీపీలో చేరనుండటంతో... టీడీపీ అభ్యర్థి ఏఎన్ మనోహర్ విజయావకాశాలు మెరుగయ్యాయని టీడీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. ఆయనతో పాటు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు మాధవి వెంకటేశ్, రమణ, చందు, మురళి, చిత్తూరు మున్సిపాలిటీ మాజీ ఛైర్ పర్సన్ సరళ మేరీ తదితరులు కూడా టీడీపీలో చేరుతున్నారు. 
Go Back to Shorts
ck babu
Telugudesam
chittoor
Chandrababu

More Telugu News