Police: ​ ఇరాక్ లో విషాదం.. టైగ్రిస్ నదిలో ఫెర్రీ మునక, 71 మంది మృతి

  • కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి 
  • 55 మందిని కాపాడిన స్థానికులు
  • మృతుల్లో పలువురు చిన్నారులు

ఇరాక్ లో కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. ఉత్తర భాగంలోని మోసుల్ వద్ద టైగ్రిస్ నదిలో ఓ ఫెర్రీ మునిగిపోవడంతో 71 మంది మృత్యువాత పడ్డారు. సహాయక చర్యల్లో భాగంగా స్థానికులు, పోలీసులు 55 మందిని కాపాడారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. కుర్ద్ ప్రజలు తమ సంస్కృతిని అనుసరించి కొత్త సంవత్సరం 'నౌరుజ్' వేడుకలు జరుపుకుంటూ ఫెర్రీపైకి పరిమితికి మించి ఎక్కారు. అయితే ఆ ఫెర్రీ మోసుల్ నగరం వద్దకు రాగానే నీట మునగడం ప్రారంభించింది. సమీపంలో బోట్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలను కాపాడడం కష్టమైపోయింది. అందుబాటులో ఉన్న బోట్లతోనే కొందరిని కాపాడే లోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News