Andhra Pradesh: ఏప్రిల్ 9న ఓటేయాలన్న లోకేశ్.. వెటకారంగా స్పందించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి!

  • ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు
  • పొరపాటున వచ్చే నెల 9న ఓటేయాలన్న లోకేశ్
  • అలాగే చేయాలని కోరిన ఆర్కే

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి నోరు జారిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 9న ఓటేయాలని ఓ బహిరంగ సభలో ప్రజలకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీంతో వైసీపీ, జనసేన మద్దతుదారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మంగళగిరిలో లోకేశ్ పై పోటీచేస్తున్న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ఈరోజు ట్విట్టర్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ..‘నారా లోకేశ్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న టీడీపీకి ఓటు వేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటువేయండి. #VoteForFan #TDPLosing’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోను జతచేశారు.




More Telugu News