Andhra Pradesh: పవన్ కల్యాణ్ కు ఝులక్.. జనసేనకు రాజీనామా చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త!

  • ప్రత్తిపాడు సమన్వయకర్తగా ఉన్న నేత
  • టికెట్ ఇచ్చేందుకు నో చెప్పిన పవన్ కల్యాణ్
  •  అనుచరులతో కలిసి టీడీపీలో చేరిన సాయికుమార్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి షాక్ తగలింది. జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త సాయికుమార్ యాదవ్ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రత్తిపాడు టికెట్ ను పవన్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ వెంటనే జనసేనకు రాజీనామా సమర్పించారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. టీడీపీలో చేరితే తగిన గౌరవంతో పాటు పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల హామీలపై సంతృప్తి చెందిన సాయికుమార్ ఈరోజు ఉదయం 2,000 మంది అనుచరులు, మద్దతుదారులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ ఏడాది జనవరి 23న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో కలిసి సాయికుమార్ జనసేనలో చేరారు. కాగా, ప్రత్తిపాడు స్థానానికి అభ్యర్థిని జనసేన ఇంకా ఖరారు చేయలేదు.

More Telugu News