Andhra Pradesh: చంద్రబాబు పరిస్థితి పగోడికి కూడా రాకూడదు.. సొంత పార్టీ అభ్యర్థులనే తిడుతున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • అభ్యర్థులను ఊసరవెల్లులు, మోసకారులు అంటున్నారు
  • ఆయన పూర్తి నిస్పృహలో కూరుకుపోయారు
  • ట్విట్టర్ లో విమర్ళలు గుప్పించిన వైసీపీ నేత

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పూర్తి నిస్పృహలోకి కూరుకుపోయిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే సొంత ఎమ్మెల్యే అభ్యర్థులను ఊసరవెల్లులు, మోసకారులని తిడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘పాపం! చంద్రబాబు పరిస్థితి పగవాడికి కూడా రావొద్దు. పూర్తి నిస్పృహలో పడి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. తన అభ్యర్థులనే ఊసరవెల్లులని, మోసకారులని తిడుతున్నాడు. ఎమ్మెల్యేలకు దోచిపెట్టినట్టు తనే ఒప్పుకుంటున్నాడు. అయినా గురువులాగే శిష్యులు తయారవుతారు కదా?’ అని ట్వీట్ చేశారు.

More Telugu News