విశాఖలోని స్టేట్ బ్యాంక్ లో కేఏ పాల్ హల్ చల్

  • ఫ్రీజ్ అయిన అకౌంట్ లోని డబ్బులు ఇవ్వాలంటూ వాగ్వాదం
  • పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదన్న బ్యాంకు సిబ్బంది
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ విశాఖలో హల్ చల్ చేశారు. జైల్ రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన సొసైటీ పేరుతో ఉన్న ఫ్రీజ్ అయిన అకౌంట్ లోని డబ్బులు తీసుకునేందుకు అనుమతించాలంటూ గొడవ పడ్డారు. సొసైటీ తనదేనని, సొసైటీకి తానే అధ్యక్షుడినని కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చిందంటూ అధికారులకు తెలిపారు.

ఈ నేపథ్యంలో, మీకు డబ్బు ఇవ్వాలంటే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని... మీకు డబ్బు ఇవ్వచ్చంటూ ఇంతవరకు తమకు ఆదేశాలు రాలేదని... అందువల్ల మీకు డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు పాల్ కు స్పష్టం చేశారు. దీంతో, బ్యాంకు అధికారులపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేసి, అక్కడి నుంచి వచ్చేశారు.
Go Back to Shorts
ka paul
visakhapatnam
bank
money
prajashanthi party

More Telugu News