Congress: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కి...నేడు లేదా రేపు ప్రకటన

  • నేడు ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం
  • సాయంత్రం ఎన్నికల కమిటీకి అభ్యర్థుల ఎంపిక బాధ్యత
  • అనంతరం జాబితా విడుదల

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా చివరి దశకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఢిల్లీలో ఈరోజు సమావేశం కానున్న స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల అంశంపై తర్జనభర్జన అనంతరం ఏఐసీసీ ఎన్నికల కమిటీకి జాబితాను పంపిస్తుంది. ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ తతంగం పూర్తయ్యాక ఈరోజు రాత్రికి లేదా రేపు అభ్యర్థుల వివరాలు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News