Foot Over Bridge: ముంబైలో కుప్పకూలిన పాదచారుల వంతెన.. నలుగురి మృతి.. పలువురికి గాయాలు

  • సీఎస్ఎంటీ సమీపంలో ఘటన
  • భయభ్రాంతులకు లోనైన ప్రజలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన ఘటన ముంబైలో జరిగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్(సీఎస్ఎంటీ) సమీపంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. సీఎస్ఎంటీ ప్లాట్‌ఫాం 1కు వెళ్లే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో నలుగురు చనిపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More Telugu News