YSRCP: టికెట్ ఇస్తానని జగన్ మోసం చేశారు: నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి

  • 2014 ఎన్నికల్లో దెందులూరు టికెట్ ఇస్తామన్నారు
  • దళితులకు న్యాయం జరగాలంటే జగన్ ఓడిపోవాలి
  • ఏపీలో వంద సీట్లలో పోటీ

గత ఎన్నికల్లో తనకు దెందులూరు టికెట్ ఇస్తానని చెప్పిన వైసీపీ చీఫ్ జగన్ ఆ తర్వాత మోసం చేశారని నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి ఆరోపించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో జగన్ చేసిన మోసానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రలోని దళితులకు న్యాయం జరగాలంటే జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదన్నారు. నవ సమాజ్ పార్టీ ఎన్నికల గుర్తు గ్యాస్ సిలిండర్ అని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఏపీలోని 100 సీట్లలో పోటీ చేస్తున్నట్టు చంద్రమౌళి తెలిపారు.  

More Telugu News