rajamouli: రాజమౌళి సినిమాకి నో చెప్పిన అలియా భట్

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు  
  • సమస్య పారితోషికం కాదన్న అలియా భట్    

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలోను, రామోజీ ఫిల్మ్ సిటీలోను ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ కి హీరోయిన్స్ కాంబినేషన్ సీన్స్ ను కూడా ప్లాన్ చేసిన కారణంగా, కథానాయికల ఎంపికపై దృష్టిపెట్టారు.

ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను అనుకుని .. ఆమెను సంప్రదించారు. అయితే హిందీలో వరుస సినిమాలు చేస్తోన్న అలియా భట్, తనకి ఖాళీ లేదని ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఒకవేళ పారితోషికం తక్కువగా భావించి ఆమె అలా చెప్పివుంటుందనుకుని, పారితోషికం పెంచడానికి కూడా సిద్ధంగా వున్నట్టుగా ఆమెతో మాట్లాడారట. కేవలం పారితోషికం గురించి ఆలోచించి తాను నో చెప్పివుంటానని అనుకోవద్దనీ, నిజంగానే వరుస కమిట్మెంట్లు ఉన్నాయని ఆమె నుంచి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తోంది.

More Telugu News