Srikakulam District: అరసవిల్లిలో అద్భుత దృశ్యం.. స్వామిని తాకిన ప్రభాత భానుడి కిరణాలు

  • స్వామి వారిని తాకిన సూర్య కిరణాలు
  • చూసేందుకు తరలివచ్చిన భక్తులు
  • ఏడాదికి రెండుసార్లు కనిపించే అద్భుతం

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భానుడి ప్రభాత కిరణాలు స్వామి మూల విరాట్‌ను తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి బారులు తీరారు. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకడం చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. సూర్యుడు ఉత్తర, దక్షిణాయన మార్పుల సమయంలో ఏడాదికి రెండుసార్లు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని ఆలయ పూజారులు తెలిపారు.

More Telugu News