Hyderabad: డేటా చోరీ కేసు.. మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ సీజ్!

  • డేటా చోరీ వ్యవహారం దర్యాప్తు వేగవంతం
  • ఐటీ గ్రిడ్స్ సంస్థ ను సీజ్ చేసిన సిట్  
  • రెండు రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు

డేటా చోరీ వ్యవహారంలో దర్యాప్తును తెలంగాణ సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేశారు. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లి సీజ్ చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై రెండు రోజులుగా సిట్ సోదాలు చేసింది. డేటాకు సంబంధించిన పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ ఉద్యోగులను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. 

More Telugu News