prabhas: 'సాహో' ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం 30 కోట్ల ఖర్చు?

  • సుజిత్ నుంచి 'సాహో' సినిమా 
  • భారీ తారాగణం - భారీ బడ్జెట్ 
  • ఆగస్టులో గానీ .. అక్టోబర్లో గాని రిలీజ్      

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందట. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ను భారీస్థాయిలో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే దాదాపు 30 కోట్లను ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు .. స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమాలో జాకీష్రాఫ్ .. నీల్ నితిన్ ముఖేశ్ .. మందిరా బేడీ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీనగానీ .. దసరా కానుకగా అక్టోబర్లో గాని విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News