‘ఓట్ల తొలగింపు’పై టీడీపీ సీరియస్.. కృష్ణా జిల్లా కలెక్టర్ కు మంత్రి దేవినేని, టీడీపీ నేతల ఫిర్యాదు!
- విజయవాడలో కలెక్టర్ ఇంతియాజ్ తో భేటీ
- వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు
- ఫామ్-7 ను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్య
టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఫామ్-7 ద్వారా తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.