it grids: ఐటీ గ్రిడ్స్ లో సర్వర్లు మాయం.. వెతుకుతున్న తెలంగాణ పోలీసులు

  • నిన్నటి నుంచి కొనసాగుతున్న పోలీసుల సోదాలు
  • గత నెల 27న సర్వర్లు మాయమైనట్టు గుర్తింపు
  • సోదాల్లో పాల్గొంటున్న ఎథికల్ హ్యాకర్లు

హైదరాబాదులోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తెలంగాణ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో బెంగళూరు నుంచి వచ్చిన ఎథికల్ హ్యాకర్లు కూడా పాల్గొంటున్నారు. కీలకమైన మూడు సర్వర్లు మాయమైనట్టు సోదాల్లో గుర్తించారు. ఈ సర్వర్లలోనే కీలకమైన డేటా ఉన్నట్టు చెబుతున్నారు. గత నెల 27న ఈ సర్వర్లు తరలిపోయినట్టు సైబరాబాద్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. 26న కార్యాలయానికి వచ్చిన అశోక్... 27 నుంచి కనిపించకుండా పోయారు. వెళ్లేటప్పుడు మూడు సర్వర్లను కూడా తనతోపాటు అశోక్ తీసుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News