Asaduddin Owaisi: పైలెట్ విషయంలో పాక్ మానవత్వంతో మెలగాలి: అసదుద్దీన్

  • కష్ట సమయంలో పైలెట్‌ కోసం ప్రార్థిస్తున్నాం
  • ప్రతి పార్టీ బందీల పట్ల మానవత్వం చూపాలి
  • ప్రస్తుత పరిణామాలను పాక్ పక్కనబెట్టాలి

భారత్ వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానం నేటి ఉదయం కూలిపోయింది. అయితే ఆ విమానం పైలెట్‌ను తమ బలాగాలు అదుపులోకి తీసుకున్నాయని పాక్ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. కష్ట సమయంలో ఆ వీర పైలెట్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

‘ఈ కష్ట సమయంలో ఈ వీర పైలట్‌తో పాటు.. అతని కుటుంబం కోసం మేం ప్రార్థన చేస్తున్నాం. జెనీవా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం.. ప్రతీ పార్టీ బందీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. పాకిస్థాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంతో మెలగాలని కోరుతున్నాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News