Andhra Pradesh: విశాఖ టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు

  • స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత
  • భారీగా తరలివచ్చిన క్రికెట్ ప్రియులు 
  • విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ విశాఖ వేదికగా మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు పద్నాలుగు వందల మంది పోలీసులతో భద్రత కల్పించారు. స్టేడియానికి వెళ్లే విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఏసీఏ వీడీసీఏ మైదానంలో నివాళులర్పించారు. రెండు జట్ల క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

More Telugu News