Shreyas Iyer: ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ వీరంగం.. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం

  • 55 బంతుల్లో 147 పరుగులు
  • సిక్కిం బౌలర్లకు చుక్కలు చూపిన ముంబై యువ బ్యాట్స్‌మన్
  • టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు

టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయాడు. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. ఇండోర్‌లో జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి రోజున సిక్కింతో జరిగిన టీ20లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 147 పరుగులు చేసి భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిషభ్ పంత్ (128)ను అయ్యర్ అధిగమించి ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ విజృంభణతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం 259 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం 104 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది.  

More Telugu News