nagarjuna: 'మన్మథుడు 2'లో నాగార్జున సరసన రకుల్

  • సెట్స్ పైకి వెళ్లిన 'వెంకీమామ'
  • షూటింగుకి వెళ్లనున్న 'మన్మథుడు 2'
  • 'వెంకీమామ' నుంచి తప్పుకున్న రకుల్       

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన శ్రియను .. చైతూ జోడీగా రకుల్ ను అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో రకుల్ లేదనే టాక్ వచ్చింది. ఆమె స్థానంలో నాభా నటేశ్ ను తీసుకున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి.  దాంతో రకుల్ తప్పుకుందా? .. తప్పించారా? అనే విషయంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

ఈ ప్రాజెక్టు నుంచి రకుల్ తప్పుకుందనేది తాజా సమాచారం. 'మన్మథుడు 2' సినిమా కోసమే ఆమె 'వెంకీమామ' నుంచి తప్పుకుందని అంటున్నారు. నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం రకుల్ ను సంప్రదించారట. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయట. తండ్రీకొడుకుల సరసన హీరోయిన్ చేసిన సినిమాలు ఒకేసారి విడుదలైతే బాగుండదని భావించిన రకుల్, 'వెంకీమామ' నుంచి తప్పుకుందని సమాచారం.

More Telugu News