NTR: 'ఎన్టీఆర్-మహానాయకుడు'లో ఓ ఎమోషనల్ సీన్ ప్రోమో!

  • మరో రెండు రోజుల్లో విడుదల కానున్న 'మహానాయకుడు'
  • ప్రోమో సీన్ ను విడుదల చేసిన యూనిట్
  • ఎన్టీఆర్, బసవతారకం మధ్య పండిన భావోద్వేగాలు

మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు'లోని ఓ ఎమోషనల్ సీన్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్, బసవతారకం మధ్య ఈ సీన్ నడుస్తుంది. "నా ప్రాణానికి ప్రాణంగా, నా బిడ్డలకు తల్లిగా, నా సహధర్మచారిణిగా... నీ అనుమతి కావాలి తారకం... ఇష్టమేనా?" అని ఎన్టీఆర్ అడుగగా, "నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా" అని బసవతారకం చెబుతుండటం ఇందులో కనిపిస్తుంది.

ఆపై కేన్సర్ సోకిన తన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బాధతో అద్దంలో నుంచి ఎన్టీఆర్ చూస్తుండటం, ఆపై "ఈ పాట నీకూ ఇష్టమేనా బావా?" అని భార్య అడుగగా, "నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా తారకం?" అని ఎన్టీఆర్ ప్రశ్నిస్తుండటం కనిపిస్తుంది. ఈ ప్రోమో వీడియోలో భావోద్వేగాలు చక్కగా పండాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ నటించిన ఈ సీన్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News