vijay devarakonda: తండ్రి పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ

  • సెట్స్ పై క్రాంతిమాధవ్ సినిమా
  • యూనియన్ లీడర్ గా విజయ్ దేవరకొండ
  • తొలిసారిగా నలుగురు కథానాయికలు      

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా క్రాంతిమాధవ్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్ గా .. ఏడెనిమిది సంవత్సరాల పిల్లాడికి తండ్రిగా కనిపిస్తాడట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కొంతవరకూ పూర్తయింది.

ఈ సినిమాలో రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లి కథానాయికలుగా కనిపించనున్నారు. తండ్రిగా విజయ్ దేవరకొండ తెరపై కనిపించడమే ఒక విశేషం అనుకుంటే, ఆయన సరసన నలుగురు కథానాయికలు నటిస్తుండటం మరో విశేషంగా చెబుతున్నారు. ఈ విషయాలే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News