Revanth Reddy: ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

  • ఓటుకు నోటు కేసులో కొనసాగుతున్న విచారణ
  • ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి, ఉదయసింహలను విచారించిన అధికారులు
  • రేవంత్ సమాధానాలను బట్టి ఉదయసింహను మళ్లీ ప్రశ్నించే అవకాశం

ఓటకు నోటు కేసులో ఈడీ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేడు హాజరయ్యారు. ఈడీ అధికారులు ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు. ఈ కేసులో ఉన్న వేం నరేందర్ రెడ్డి, ఉదయసింహలను ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు. రేవంత్ చెప్పే సమాధానాలను బట్టి ఉదయసింహను మళ్లీ ప్రశ్నించే అవకాశం ఉంది. 

More Telugu News