Telangana: బైక్ ను ఢీకొట్టిన గ్యాస్ ట్యాంకర్.. ఇద్దరు అక్కడికక్కడే మృతి!

  • సికింద్రాబాద్ లోని తార్నాక డిగ్రీ కాలేజీ వద్ద ఘటన
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనుమానం

తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి తార్నాక డిగ్రీ కాలేజీ వద్ద వేగంగా వెళుతున్న ఓ గ్యాస్ ట్యాంకర్ అటుగా వెళుతున్న బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న నవీన్‌(50), సోమరాజు(32) అంతెత్తున ఎగిరిపడ్డారు. వీరిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News