Jyothi: మరే అమ్మాయి ఇలా మోసపోకూడదు... జ్యోతి ప్రియుడు శ్రీనివాస్ దాష్టీకాలపై షార్ట్ ఫిల్మ్ తయారు చేయిస్తున్న విజయవాడ పోలీసులు!

  • అమ్మాయిలను సులువుగా నమ్మించడంలో శ్రీనివాస్ దిట్ట
  • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నగ్న వీడియోల చిత్రీకరణ
  • శ్రీనివాస్ మొబైల్ ఫోన్ లోని వీడియోలతో షార్ట్ ఫిల్మ్
  • అమ్మాయిలకు హెచ్చరికగా ఉంటుందన్న విజయవాడ అర్బన్ ఎస్పీ

అమ్మాయిలకు ప్రేమ పేరిట వల, ఆపై వారిని నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లడం, వారితో సన్నిహితంగా గడుపుతూ, నగ్న దృశ్యాలు, వీడియోలు సేకరించడం, ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేయడం... ఇదీ అమరావతి ప్రాంతంలో దారుణంగా హత్యకు గురికాబడిన జ్యోతి కేసులో నిందితుడు శ్రీనివాస్ వ్యవహారం. జ్యోతి కేసు విచారణను ఓ కొలిక్కి తెచ్చిన పోలీసులు ప్రధాన నిందితుడు ప్రియుడు శ్రీనివాసేనని తేల్చారు.

శ్రీనివాస్ సెల్ ఫోన్లో ఎంతో మంది అమ్మాయిల నగ్న దృశ్యాలు, వీడియోలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరే ఇతర అమ్మాయి, ప్రేమ మోజులో పడిపోయి, ఇలా మోసపోకుండా ఉండేందుకు శ్రీనివాస్ దాష్టీకాలపై అతని సెల్ ఫోన్ లోని వీడియోలను వాడుతూ షార్ట్ ఫిల్మ్ ను తయారు చేయాలని విజయవాడ అర్బన్ ఎస్పీ విజయరావు నిర్ణయించారు.

అతని దాష్టీకాలు, ఫేస్ బుక్, వాట్స్ యాప్ ద్వారా నమ్మించి చాటింగ్, సినిమాలు, షికార్లకు తిప్పడం వంటి వివరాలతో పాటు, జ్యోతి హత్య, పోలీసులకు చిక్కకుండా వేసిన ఎత్తులు, కేసును తప్పుదారి పట్టించాలని చూసిన వైనాన్ని వివరిస్తూ, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించనున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో విచారణ 99 శాతం ముగిసిందని, నేడో, రేపో నిందితులను న్యాయస్థానం ముందు నిలుపుతామని తెలిపారు.

More Telugu News