Andhra Pradesh: పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలి: సీఎం చంద్రబాబు

  • పదవులు రావన్న భయంతోనే పార్టీలు మారుతున్నారు
  • నిత్యం ప్రజల్లో ఉండేవారికే మా పార్టీ టికెట్లు ఇస్తాం
  • మోదీ మరోసారి విభజన గాయాలను రేపుతున్నారు

పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ఆ నేతలు తమకు పదవులు రావన్న భయంతోనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండేవారికే తమ పార్టీ టికెట్లు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, టీఆర్ఎస్, వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. మోదీ మరోసారి రాష్ట్ర విభజన గాయాలను రేపుతున్నారని, నవ్యాంధ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. వైసీపీకి టీఆర్ఎస్ లోపాయికారీ మద్దతు ఇస్తోందని విమర్శించారు.

More Telugu News