Paual: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వెంకటేశ్ హీరోయిన్ గా పాయల్ 
  • 'జయహో నాయక'గా మమ్ముట్టి 
  • బాలకృష్ణ, బోయపాటి సినిమా అప్ డేట్

*  సీనియర్ హీరో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించనుంది. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందే 'వెంకీమామ' చిత్రంలో వెంకటేశ్ పక్కన నాయికగా పాయల్ ను తీసుకున్నారట. ఇక చైతూ సరసన ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
*  ఇటీవల 'యాత్ర' సినిమాతో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరవడంతో, గతంలో ఆయన నటించిన మలయాళ చిత్రాలను ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆయన నటించిన 'పుతన్ పానం' చిత్రాన్ని 'జయహో నాయక' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ కథతో రూపొందిన చిత్రం.
*  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ముహూర్తం ఈ నెలాఖరులో జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే మే నెలలో మొదలవ్వచ్చని అంటున్నారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News