sexual desire: కోడలిపై కన్నేసి సొంత కొడుకునే కిరాతకంగా చంపిన తండ్రి.. శవాన్ని ముక్కలుగా కోసి డ్రైనేజీలో పారవేత!

  • పంజాబ్ లోని ఫరిద్ కోట్ లో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కొడలిపై కన్నేసిన ఓ వ్యక్తి సొంత కొడుకునే కిరాతకంగా హతమార్చాడు. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రైనేజీలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పంజాబ్ లోని ఫరిదోకోట్ లో చోటుచేసుకుంది. ఫరిద్ కోట్ కు చెందిన ఛోటా సింగ్(62) కోడలు జస్వీర్ కౌర్ పై కన్నేశాడు. అడ్డుగా ఉన్న కుమారుడిని చంపేస్తే ఆమెను పెళ్లి చేసుకోవచ్చని భావించాడు.

ఈ నేపథ్యంలో కొడుకు రాజ్విందర్ సింగ్ నిద్రపోతుండగా పదునైన ఆయుధంతో హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి డ్రైనేజీలో పడేశాడు. అయితే ఈ శబ్దానికి మేలుకున్న మేనల్లుడు గురుచాన్ సింగ్ గదంతా రక్తంతో నిండి ఉండటాన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు ఛోటా సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. రాజ్విందర్-జస్వీర్ కు 12 ఏళ్ల క్రితం వివాహం అయిందని తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామనీ, కోర్టు ముందు హాజరుపరుస్తామని పేర్కొన్నారు.

More Telugu News