Jammu And Kashmir: అమితాబ్ పెద్ద మనసు.. వీర జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం!

షార్ట్స్‌లో చూడండి
పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ భారీ విరాళం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సాయం చేయనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ ప్రతినిధి మీడియాకు అమితాబ్ ప్రతినిధి తెలిపారు. దేశం కోసం అసువులు బాసిన అమర జవాన్ల కుటుంబాలను అమితాబ్ నేరుగా కలవబోతున్నట్టు వెల్లడించారు. కాగా, ‘భారత్ కే వీర్ నిధి’కి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఇప్పటికే విరాళాలు అందజేశారు. 
Go Back to Shorts
Jammu And Kashmir
pulwama
bollywoood
amitabh

More Telugu News