Priyanka gandhi vadra: పుల్వామా ఘటనతో ప్రెస్‌మీట్ రద్దు చేసుకున్న ప్రియాంక

  • పుల్వామా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
  • ఆత్మీయుల్ని కోల్పోయిన బాధ గురించి నాకు తెలుసు
  • భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మీయుల్ని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల వేదనను తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడిలో అమరులైన 42 మంది సైనికులకు సంతాపం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రియాంక.. ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం సరైనది కాదంటూ లక్నోలో నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.  

More Telugu News