Narendra Modi: ట్రిపుల్ తలాక్ చెప్పిన వాళ్లను జైలుకు పంపిస్తున్నారు.. అది చెప్పకుండా భార్యను వదిలిపెట్టిన మోదీనేం చేయాలి?: చంద్రబాబు

  • విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు 
  • కుటుంబ వ్యవస్థపై నమ్మకముంది
  • భువనేశ్వరికి భర్తగా గర్వపడుతున్నా

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ముస్లింలను ఈ కేసులో జైలుకు పంపిస్తున్నారని.. తాను మాత్రం ట్రిపుల్ తలాక్ చెప్పకుండానే భార్యను వదిలిపెట్టారని.. అలాంటి వ్యక్తిని ఏం చేయాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నేడు విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థపై తనకు నమ్మకముందన్నారు. భువనేశ్వరి భర్తగా, లోకేశ్ తండ్రిగా, దేవాన్ష్ తాతగా గర్వపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News