mulayam: మోదీని ములాయం సింగ్ ఎందుకు పొగిడారంటే...: అమర్ సింగ్

  • ఎస్పీ, బీఎస్పీలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి
  • వాటిని కప్పిపుచ్చుకునేందుకే మోదీని ములాయం పొగిడారు
  • ములాయం, మాయావతి అండదండలతో ఇద్దరు ఐఏఎస్ లు నోయిడాను దోచుకున్నారు

ప్రధాని మోదీ మరోసారి పీఎం కావాలంటూ వ్యాఖ్యానించిన సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ పై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా ములాయం వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎస్పీ, బీఎస్పీలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని... ఈ ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

పలు కుంభకోణాల కేసుల్లో ఐఏఎస్ అధికారులు చంద్రకళ, రామరామన్ లు ఇరుక్కున్నారని... వారిని కాపాడేందుకు ములాయం యత్నిస్తున్నారని అమర్ సింగ్ చెప్పారు. ములాయం, మాయావతి అండదండలతో ఈ ఇద్దరు ఐఏఎస్ లు నోయిడాను దోచుకున్నారని ఆరోపించారు. వారిపై దర్యాప్తు జరగకుండా మోదీని నిలువరించేందుకే ములాయం ఆయనను పొగిడారని చెప్పారు.

More Telugu News